లూసీఫర్ 2: పృథ్వీరాజ్ రోల్ ఎలా ఉండబోతోందంటే..

ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా పరిశ్రమల నుంచి సీక్వెల్ మూవీలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా రూపొందుతోన్నాయి.

Update: 2024-10-16 07:12 GMT

ఇండియా వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా పరిశ్రమల నుంచి సీక్వెల్ మూవీలు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా రూపొందుతోన్నాయి. ముఖ్యంగా కొంత కాలం క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన చిత్రాలకు కొనసాగింపుగా ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. అలాంటి సినిమాల్లో ‘L2: ఎంపురాన్’ (L2: Empuran) ఒకటి. 2019లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘లూసీఫర్’కు ఇది సీక్వెల్‌గా రాబోతుంది.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో.. ప్రముఖ నటుడు పృథ్వరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన సినిమానే ‘లూసీఫర్’. ఫుల్ లెంగ్త్ యాక్షన్ అండ్ ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ చిత్రం అద్భుతమైన స్పందనను అందుకుంది. దీంతో అప్పుడే దీనికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై కసరత్తు చేస్తూనే ఉన్నారు.

సూపర్ హిట్ మూవీకి సీక్వెల్‌గా రాబోయే ‘L2: ఎంపురాన్’ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంతేకాదు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం ఈ సినిమాను గతంలో కంటే హై రేంజ్ కంటెంట్‌తో తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు. దీంతో దీనిపై హైప్ మరింతగా పెరిగిపోతూనే ఉంటోంది.

‘L2: ఎంపురాన్’ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తి అయినప్పటికీ దీని నుంచి ప్రచార చిత్రాలు అంటే పోస్టర్లు, వీడియోలు, సాంగ్స్, ఫస్ట్ లుక్స్ పెద్దగా విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ, కీలక పాత్రను పోషిస్తోన్న పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజును పురస్కరించుకుని తాజాగా దీని నుంచి అతడి లుక్‌ను విడుదల చేశారు.

‘L2: ఎంపురాన్’ సినిమా నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్ సోల్జర్‌ గెటప్‌తో కనిపించాడు. దీన్ని విడుదల చేసిన చిత్ర యూనిట్ ‘జాయెద్ మసూద్‌.. దేవుడు విడిచిపెట్టాడు.. కానీ డెవిల్ పోషించాడు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ‘లూసీఫర్’ సినిమాలో మాదిరిగా కొన్ని సన్నివేశాలకే పరిమితం కాకుండా.. ఇందులో పృథ్వీరాజ్ రోల్ మరింత ఎలివేట్ కాబోతుందని అర్థం అవుతోంది.

హై ఓల్జేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న ‘L2: ఎంపురాన్’ మూవీని లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఎంపురాన్‌ని ఆంటోని పెరుంబవూరు నిర్మిస్తున్నారు. ఇందులో టివినో థామస్, ఇంద్రజిత్, మంజు వారియర్, అర్జున్ దాస్ వంటి వాళ్లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి దీపక్ దేవ్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమాను 2025 మార్చిలో విడుదల చేయబోతున్నారు.

Tags:    

Similar News