ర‌క్త పిశాచుల క‌థ‌లో నేష‌న‌ల్ క్ర‌ష్!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-06-27 08:30 GMT

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవు డ్...బాలీవుడ్ అంటూ రెండు భాష‌ల్ని దున్నేస్తుంది. ఓవైపు హీరోయిన్ గా న‌టిస్తూనే లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌కు క‌మిట్ అవుతుంది. తాజాగా అమ్మ‌డు మ‌రో కొత్త సినిమాకి సైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానీ హీరోగా ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రం చేస్తున్నాడు. ఇందులో ఆయుష్మాన్ కి జోడీగా ర‌ష్మిక లాక్ అయిన‌ట్లు స‌మాచారం.

ఇందులో అమ్మ‌డి పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. `వాంపైర్స్ ఆఫ్ విజ‌య‌న‌గ‌ర` టైటిల్ ఈ చిత్రానికి ప‌రిశీలిస్తున్నారు. ఆదిత్య స‌త్పోద‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `స్త్రీ`,` భేడియా`, `మూంజ్యా` లాంటి చిత్రాలు నిర్మించిన దినేష్ విజ‌న్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ ద‌శలో ఉందీ ప్రాజెక్ట్. ర‌క్త పిశాచుల చుట్టూ తిరిగే స్టోరీ అని స‌మాచారం.

ర‌క్త పిశాచుల లోకంలోకి అనుకోకుండా వెళ్తే? అక్క‌డ మాన‌వాళికి ఎలాంటి ముప్పు ఉంటుంది? అన్న పాయింట్ ని హైలైట్ చేస్తున్నారు. ఈ క‌థ‌ని ఎంతో లోతుగా విశ్లేషించి త‌యారు చేస్తున్నారు. కొన్ని రకాల న‌వ‌లల ఆధారంగానూ తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఏడాది చివ‌రిక‌ల్లా క‌థ పూర్త‌వుతుందిట‌. వ‌చ్చే ఏడాది ఆరంభంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ఆలోచన చేస్తున్నారుట‌.

ప్ర‌స్తుతం ఆయుష్మాన్ ఖురానీ హీరోగా క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. అలాగే ర‌ష్మిక ప‌లు సినిమాల‌తో బిజీగా గ‌డుపుతుంది. ఆమె కూడా ఇప్ప‌టికిప్పుడు డేట్లు ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఏడాదంతా ఆమె డేట్లు లాక్ అయ్యాయి. ర‌ష్మిక కొత్త డేట్లు ఇవ్వాలంటే డిసెంబ‌ర్ వర‌కూ వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News