జాక్వెలిన్ కి విహార నౌక గిప్టు గా ఇస్తా!

కాన్ మాన్ సుకేష్ చంద్ర‌- బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ పెర్నాండేజ్ మ‌ధ్య రిలేష‌న్ షిప్ గురించి తెలిసిందే.

Update: 2024-08-12 05:52 GMT

కాన్ మాన్ సుకేష్ చంద్ర‌- బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ పెర్నాండేజ్ మ‌ధ్య రిలేష‌న్ షిప్ గురించి తెలిసిందే. 200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్ర జైల్లో ఉంటూనే ప్రియురాలి కోసం బ‌హుమ‌తులు గుప్పిస్తున్నాడు. ఆగ‌స్టు 11న జాక్వెలిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏకంగా విహార నౌక‌నే(యాట్) గిప్టుగా ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ఓ లేఖ రాసాడు.

అందులో ఏమందంటే? 2021 లో జాక్వెలిన్ విలాస‌వంత‌మైన నౌక గిప్ట్ గా అడిగింది. `లేడీ జాక్వెలిన్` పేరుతో గిప్టుగా ముస్తాబైంది. ఈ నౌక ఈనెల‌లోనే వస్తుంది. అందుకు సంబంధించిన అన్ని ర‌కాల ప‌న్నులు కూడా చెల్లించా. అలాగే ఆమె అభిమానుల‌కు 100 ఐఫోన్లు కూడా ఇస్తున్నా. ఇంకా మూగ‌జీవాల సంక్షేమం కోసం, ఆప‌ద‌లో ఉన్న వారిని ఆదుకునే విష‌యంలో జాక్వెలిన్ ముందుకొస్తుంది.

ఈ సంద‌ర్భంగా కేర‌ళలోని వ‌యనాడ్ బాధితుల‌కు 15 కోట్లు వెచ్చించా. బాధితుల‌కు 300 ఇళ్లు క‌ట్టిస్తాం` అని పేర్కొన్నాడు. మ‌రి ఈ లేఖ‌పై జాక్వెలిన్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి. మ‌నీలాండ‌రింగ్ కేసులో సుకేష్ చంద్ర అరెస్ట్ అయిన త‌ర్వాత జాక్వెలిన్ ని ఈడీ ప‌లుమార్లు విచారించిన సంగ‌తి తెలిసిందే. సుకేష్ చంద్ర నుంచి గిప్టులు అందుకోవ‌డం విష‌యంలో ఇద్ద‌రి మధ్య ఉన్న విష‌యాల న్నింటిని ఈడీకి వెల్ల‌డించింది.

ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్ద‌మే న‌డించింది. జైలు నుంచే జాకీ కి సుకేష్ లేఖ‌లు రాయ‌డం మొద‌లు పెట్టాడు. దీంతో జాక్వెలిన్ పై నెట్టింట పెద్ద ఎత్తున ట్రోలింగ్ జ‌రిగింది. ఇది భ‌రించ‌లేని జాకీ ద‌య‌చేసి న‌న్ను వ‌దిలేయండి అంటూ వేడుకుంది. తాజాగా మ‌ళ్లీ ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా సుకేష్ మ‌రో లేఖ రాయ‌డంతో సీన్ మ‌ళ్లీ వేడెక్కుతోంది.

Tags:    

Similar News