మహేష్ సినిమా సెకండ్ పార్ట్ లో ఆ స్టార్స్..!

కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

Update: 2024-01-28 02:45 GMT

సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబో సినిమా అనగానే పాన్ ఇండియా లెవెల్ లో సినిమా గురించి హడావిడి మొదలైంది. ఈ సినిమా కథ ఏంటి.. బడ్జెట్ ఎంత.. ఎక్కడ తీయబోతున్నారు లాంటి విషయాల మీద ముంబై మీడియా కూడా స్పెషల్ ఫోకస్ చేస్తుంది. మహేష్ 29వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కె.ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాను నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని మహేష్ ని చూపించడానికి సిద్ధమయ్యారట.

బాహుబలి తరహాలోనే ఈ సినిమాను కూడా రెండు భాగాలుగా తీయాలని చూస్తున్నారట. కథ కూడా అలానే ప్లాన్ చేశారట. అయితే బాహుబలి పంథాలోనే రెండు పార్టులను ఒక దాని వెంట మరోటి రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందట. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా సెకండ్ పార్ట్ లో మరో ఇద్దరి స్టార్స్ ని కూడా తీసుకొచ్చేలా చూస్తున్నారట. ఆ ఇద్దరు కూడా ఎన్.టి.ఆర్, రాం చరణ్ అని అంటున్నారు.

మహేష్ సినిమాలో వారికేం పని.. వారిద్దరితో ఆల్రెడీ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చేశాడుగా అనుకోవచ్చు. ఇంటర్నేషనల్ లెవెల్ లో రాజమౌళికి గుర్తింపు తెచ్చిన RRR హీరోలను తన నెక్స్ట్ సినిమాలో కూడా వాడుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడట. అందుకే మహేష్ సినిమా సెకండ్ పార్ట్ లో వారిద్దరు కూడా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తారని తెలుస్తుంది. అయితే ఇది నిజంగా జరిగితే మాత్రం ఇక రికార్డుల గురించి చెప్పుకోవడం కొత్త అవుతుంది.

మహేష్ రాజమౌళి సినిమాలో తారక్, చరణ్ ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది. జస్ట్ ఆ ఆలోచనే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అదే నిజమైతే అదిరిపోతుంది. అక్కడ ఉంది రాజమౌళి కాబట్టి ఏమైనా చేయగలడు.. చేస్తాడు. మహేష్ సినిమాపై వస్తున్న ఈ వార్తల్లో ఏది వాస్తవం ఏది రూమర్ అన్నది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా హాలీవుడ్ రేంజ్ లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కించబోతున్నారట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వర్క్ షాప్ కూడా నిర్వహించనున్నారు. ఈ సినిమా కోసం మహేష్ రెండేళ్లు డేట్స్ ఇవ్వనున్నారట. అప్పటికల్లా సినిమా పూర్తి చేసేలా రాజమౌళి ప్లానింగ్ ఉందని టాక్.


Tags:    

Similar News