స‌త్తెన‌ప‌ల్లి.. అంబ‌టికి షాకిచ్చిన నాయ‌కులు.. !

ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు అంబ‌టి రాంబాబుకు భారీ షాక్ త‌గిలింది.

Update: 2024-08-27 16:30 GMT

ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు అంబ‌టి రాంబాబుకు భారీ షాక్ త‌గిలింది. నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా మంది నాయ‌కులు... అంబ‌టి అనుచ‌రులుగా ముద్ర‌వేసుకున్న వారు.. తాజాగా.. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు జై కొడుతున్నారు. నకరికల్లు మాజీ వైసీపీ జడ్పీటీసీ, అంబ‌టి ప్రదాన అనుచరుడు, నకరికల్లు మండలం దేచవరం గ్రామానికి చెందిన రాఘవరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక‌, ఈయ‌న వెంట‌నే రాఘ‌వ‌రెడ్డి ప్రధాన అనుచరుడు కొండా మురళీధర్ రెడ్డి అలియాస్ కేబుల్ మురళి కూడా ఎమ్మెల్యే క‌న్నా సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. కొన్నాళ్లుగా ఇక్క‌డి రాజ‌కీయాలు స్త‌బ్దుగా ఉన్నాయి. ముఖ్యంగా కేబుల్ వ్యాపారంలో ఉన్న వైసీపీ నాయ‌కులకు అధికార పార్టీ నుంచి షాక్ త‌గులుతోంది. దీంతో త‌మ వ్యాపారాలు దెబ్బ‌తింటే.. అస‌లు మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌ని గుర్తించిన నాయ‌కులు.. పార్టీ మారిపోయేందుకు రెడీ అయ్యారు.

ఈ క్ర‌మంలోనే నకరికల్లు డిష్ టీవీని టీడీపీ వాళ్లు తీసివేస్తారని.. వ‌చ్చే రోజుల్లో త‌మ బిజినెస్ మ‌రింత డ‌ల్ అయిపోతుంద‌ని గుర్తించిన నాయ‌కులు టీడీపీలోకి వెళ్లాలంటూ.. రాఘవ రెడ్డి సలహా మేరకు పార్టీ మారుతున్నట్టు తెలిసింది. టీడీపీ కార్యకర్తలు కూడా వీరిని ఆహ్వానిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అంబ‌టికి అనుచ‌రులుగా ఉన్న‌వారు.. ఇప్పుడు ఆయ‌న ప‌ట్టించుకోక‌పోవ‌డంతో గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. మ‌రీ ముఖ్యంగా పార్టీ మారితే బెటర్ అనుకుంటున్నారు.

ఎన్నికల తర్వాత గెలిచిన పార్టీలో చేరడం.. ఇక్క‌డ కామ‌నే. గ‌తంలో కూడా ఇలానే చేశారు. మ‌రోవైపు.. వ‌చ్చే రోజుల్లో ఫైబ‌ర్ నెట్‌ను మ‌రింత విస్త‌రించాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. త‌మ‌పై ప్ర‌భావం మ‌రింత ప‌డుతుంద‌ని నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే స‌మ‌క్షంలో వారు టీడీపీ జెండా క‌ప్పుకొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. అంబ‌టి మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. ఆయ‌న కు తెలియ‌దా? అంటే తెలుసు. కానీ, ఏమీ చేయ‌లేని నిస్స‌హాయత ఇప్పుడు అంబ‌టిని చుట్టుముట్టిందని టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News