మలేషియాలో మ్యాన్ హోల్ లో పడిన తెలుగు మహిళ.. రెస్క్యూ అప్ డేట్ ఇదే!

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయలక్ష్మి (48) గల్లంతైంది.

Update: 2024-08-24 07:32 GMT

మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయలక్ష్మి (48) గల్లంతైంది. ఫుట్ పాత్ పై అందరిలాగానే నడుచుకుంటూ వెళ్తుండగా... ఒక్కసారిగా ఆ ఫుట్ పాత్ కుంగిపోయింది.. ఫలితంగా.. సదరు మహిళ మురికికాలువలో పడి గల్లంతైంది. దీంతో... అక్కడున్న వారు దీన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

అవును... మలేషియాలోని కౌలాలంపూర్ లో ఫుట్ పాత్ పై నడుస్తుండగా ఓ మహిళ మ్యాన్ హోల్ లో పడిపోయింది. ఈ మ్యాన్ హోల్ లోతు సుమారు ఎనిమిది మీటర్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ సమయంలో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుంది. ప్రస్తుతం ఆ మహిళ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.

ఇందులో భాగంగా... మ్యాన్ హోల్ వద్ద రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. అయితే ప్రస్తుతం మ్యాన్ హోల్ లో జలప్రవాహం ఎక్కువగా ఉందని.. దీంతో ఈ ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయి ఉంటారని స్థానిక పోలీసులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం నుంచీ ఈ సెర్చ్ ఆపరేషన్ జరుగుతుంది.

కాగా... కుప్పం నియోజకవర్గం లోని అనిమిగానిపల్లెకు చెందిన విజయలక్ష్మి.. మలేషియా రాజధాని కౌకాలంపూర్ లో ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రోడ్డు పక్కన వెళ్తూ ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్ లో పడిపోయారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరాతీశారు. ఇందులో భాగంగా... ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్ తో ఫోన్ లో మాట్లాడారు.

Full View
Tags:    

Similar News