ఎంతటి యుద్ధం అయినా.. ముగింపు మన మోదీ చేతిలోనే..

ఈ ప్రపంచంలో అటు పుతిన్ తో ఇటు జెలెన్ స్కీతో మాట్లాడే ఏకైక నాయకుడు భారత ప్రధాని మోదీ.. ఈ మాటలన్నది ఎవరో కాదు మన విదేశాంగ మంత్రి జైశంకర్.

Update: 2024-10-08 19:30 GMT

ఈ ప్రపంచంలో అటు పుతిన్ తో ఇటు జెలెన్ స్కీతో మాట్లాడే ఏకైక నాయకుడు భారత ప్రధాని మోదీ.. ఈ మాటలన్నది ఎవరో కాదు మన విదేశాంగ మంత్రి జైశంకర్. ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పే వ్యక్తి జైశంకర్. ఇక రెండున్నరేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ప్రపంచ దేశాల్లో ఎక్కువ శాతం ఉక్రెయిన్ వైపు నిలిచాయి. దీనికి కారణం నాటో. అయితే, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ మాత్ర రష్యాను సమర్థించాయి. అత్యంత సంక్లిష్టమైన ఈ పరిస్థితుల్లో భారత్ మాత్రం అద్భుతమైన నిలకడ ప్రదర్శించింది. చివరకు తామ తటస్థ పక్షం కూడా కాదని.. శాంతి పక్షం అని చెప్పింది.

రెండు దేశాల్లోనూ పర్యటన

యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్ ను అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని సహా పలు నాటో, నాటోయేతర దేశాల నాయకులు సందర్శించారు. అయితే, వీరెవరూ రష్యాను సందర్శించలేరు. కారణం.. బద్ధ శత్రుత్వమే. ఇక రష్యాలో ఉత్తర కొరియా అధినేత కిమ్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాత్రమే పర్యటించారు. వీరు ఉక్రెయిన్ కు వెళ్లలేదు. అయితే, అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ కు వెళ్లిన ఏకైక ప్రపంచ నాయకుడు భారత ప్రధాని మోదీనే అని చెప్పాలి. అది కూడా రష్యా వెళ్లిన నెలన్నర రోజుల్లోనే ఉక్రెయిన్ కు వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగానే తామ తటస్ట పక్షం కాదని శాంతి పక్షం అని నొక్కి చెప్పారు.

ఇజ్రాయెల్ వైపా? యుద్ధం వైపా?

ప్రపంచంలో ఇప్పుడు మరో దిక్కున ఇజ్రాయెల్- పలు ముస్లిం దేశాలతో యుద్ధం చేస్తోంది. ఏడాదిగా హమాస్ ల కేంద్రం గాజాపై అలుపెరగని పోరాటం సాగిస్తోంది ఇజ్రాయెల్. లెబనాన్ లోని హెజ్బొల్లాకు మద్దతుగా ఇరాన్, యెమెన్ నుంచి హూతీలు ఇలా ఏకకాలంలో ఏడుగురితో పోరాడుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చెప్పారు. అయితే, ఇక్కడ కూడా కొన్ని దేశాలు ఇజ్రాయెల్ వైపు మరికొన్ని ఇరాన్ తదితర దేశాల వైపు నిలిచాయి. భారత్ ఏమీ తేల్చుకోలేని సందర్భం ఇది.

ముగించాలని మోదీ వైపు .

యుద్ధం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ ఓల్మెర్ట్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ముంగించాలనే పిలుపునకు భారత ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ నాయకులలో మోదీ ముఖ్యులని చెప్పారు. ‘ఇజ్రాయెల్‌- హమాస్‌ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌ మద్దతు అవసరం. భారత్‌ అపారమైన, ముఖ్యమైన అత్యంత గౌరవనీయ దేశం. యుద్ధ ముగింపునకు ఆ దేశ నాయకత్వం మాకు, పాలస్తీనియన్లకు అత్యంత అవసరం ’ చెప్పిన ఆయన.. యుద్ధం ముగించాల్సిన సమయం వచ్చిందని కూడా పేర్కొన్నారు.

Tags:    

Similar News