ఆదివారం అర్థరాత్రి వేళలో హైదరాబాద్ బీజేపీ నగర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ పై దాడి జరిగింది. అభిమన్యు అనే వ్యక్తి అరుణ్ కుమార్ పై స్క్రూడ్రైవర్ తో దాడి చేయటం కలకలం రేపింది. దాదాపు 20 సార్లు స్క్రూడైవర్ తో పొడిచి అరుణ్ కుమార్ ను గాయాల పాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదంతంలో బీజేపీ నేత అరుణ్ కుమార్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
దాడి సమాచారం తెలిసిన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు హూటాహుటిన చేరుకున్నారు. గాయపడిన అరుణ్ కుమార్ ను అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు.ప్రాధమిక సమాచారం ఆధారంగా అభిమన్యుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంతకీ అభిమన్యు ఎవరు? బీజేపీ నేతపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? వీరిద్దరి మధ్య పాతకకక్ష్యలు ఏమైనా ఉన్నాయా? అన్నది కూడా ప్రశ్నగా మారింది. వ్యక్తిగత కక్షలు లేని పక్షంలో.. ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలాంటి దాడి చేయించారా? అన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా ఈ దాడి వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్నది మాత్రం తేల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.
దాడి సమాచారం తెలిసిన వెంటనే బంజారాహిల్స్ పోలీసులు హూటాహుటిన చేరుకున్నారు. గాయపడిన అరుణ్ కుమార్ ను అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స చేస్తున్నారు.ప్రాధమిక సమాచారం ఆధారంగా అభిమన్యుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంతకీ అభిమన్యు ఎవరు? బీజేపీ నేతపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? వీరిద్దరి మధ్య పాతకకక్ష్యలు ఏమైనా ఉన్నాయా? అన్నది కూడా ప్రశ్నగా మారింది. వ్యక్తిగత కక్షలు లేని పక్షంలో.. ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలాంటి దాడి చేయించారా? అన్న అనుమానాలు ఉన్నాయి. మొత్తంగా ఈ దాడి వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటన ఎలా చోటు చేసుకుందన్నది మాత్రం తేల్లేదు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది.