డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆ ముంబై జంట విడుదల !

Update: 2021-04-16 17:30 GMT
ఖతార్ ‌లో డ్రగ్స్  అక్రమ రవాణాకి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ముంబైకి చెందిన దంపతులు ఒనిబా, షరిక్ ఖురేషి 2019 లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆదేశ న్యాయస్థానం వీరిని దోషిగా తేల్చి ఈ కేసులో ఈ దంపతులకు 10 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. అయితే ఈ దంపతుల కుటుంబాలు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఆ తర్వాత  ఎట్టకేలకు ఒనిబా, షరిక్ ఖురేషి నిర్దోషిలుగా తేలడంతో ఈ ముంబైకి చెందిన దంపతులు గురువారం తమ కుమార్తెతో కలిసి భారత్ లో అడుగు పెట్టారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ జంట ముంబై విమానాశ్రయంలో దిగినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి వెల్లడించారు.  

ఈ దంపతులు ఖతార్ కు వెళ్తున్న సమయంలో వీరి బ్యాగ్ లో వారికి తెలియకుండానే కుటుంబ సభ్యుడు మాదక ద్రవ్యాలను పెట్టినట్లు తెలియడంతో..ఈ జంటపై ఉన్న ఆరోపణలను తొలగించి నిర్దోషులుగా విడుదల చేశారు. 2019 లో ఖతారీ అధికారులు ఈ దంపతుల బ్యాగ్ లో ఉన్న 4.1 కిలోల మత్తు పదార్ధాలను  స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మత్తు పదార్ధాల రవాణా చేస్తున్నారంటూ.. ఈ జంటను 2019 జూలైలో అరెస్టు చేశారు. ఆ తర్వాత దోషులుగా  తేల్చి కోర్టు శిక్ష విధించడంతో , ఈ జంట తమకు న్యాయం చేయమని భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. అధికారుల విచారణలో షరిక్ ఖురేషి అత్త తబస్సం ఖురేషి మత్తు పదార్ధాలను ఈ దంపతుల బ్యాగ్ లో వారికి తెలియకుండా పెట్టినట్లు తెలిసింది.

అంతేకాదు. ఈ దంపతుల ఖతార్ యాత్రను తబస్సుం స్పాన్సర్ చేసినట్లు తెలిసింది. వీరు దోషులుగా తేలిన సమయంలో షరిక్ జపనీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఒనిబా గర్భవతి. ఆమె గత ఫిబ్రవరిలో జైలులో ఆయత్ అనే అమ్మాయికి జన్మనిచ్చింది. తమ విషయంలో జోక్యం చేసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ దంపతుల కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్‌ సిబి అధికారులు ఖతార్‌ లోని అధికారులతో సంప్రదించారు. అక్కడ కోర్టుని ఆశ్రయించారు. చివరికి, ఈ జంట నిర్దోషులుగా తేలడంతో అక్కడ ప్రభుత్వం వీరికి విధించిన శిక్షను  రద్దు చేసి , జైలు నుండి విడుదల చేసింది.
Tags:    

Similar News