ఎమ్మెల్యే రోజా కూతురికి అరుదైన గౌరవం

Update: 2021-10-02 03:30 GMT
తల్లి రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ .. కూతురు తల్లికి తగ్గ తనయురాలిగా ఎదిగింది. రాజకీయాల్లో కాకుండా చదవుల్లో సరస్వతి అయ్యింది. ఎమ్మెల్యే రోజాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది.

వైసీపీ ఫైర్ బ్రాండ్ , నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా కూతురు అన్షు మాలికకు అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాత అన్షు ఎన్సర్ యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఆమె ఫొటోను ప్రచురించడం విశేషం.

ఒక రచయితగా.. ఎంటర్ ప్రెన్యూనర్ గా, ప్రోగ్రామర్ గా సమాజం కోసం పాటుపడుతున్నందుకు యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఆమె ఎంపికైనట్లు ఇన్ఫ్ల ఎన్సర్ సంస్థ ప్రకటించింది. దీనిపై స్పందించిన అన్షూ.. తన కల నెరవేరిందని సంతోష పడింది.

కాగా ఇటీవలే బర్న్ అచీవర్ మ్యాగజైన్ కవర్ పేజీపై క్వీన్ ఆఫ్ టాలెంట్ గా ఆమె ఫొటో వేశారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణికి అన్షు మల్లికా, కృష్ణ లోహిత్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజా సినిమాల్లో అగ్రతారగా కొనసాగిన విషయం తెలిసిందే. ఆమె రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ గా రాణిస్తున్నారు.

అయితే రోజా గారాల పట్టి కూతురు అన్షు మల్లికా కూడా తనకు ఇష్టమైన రంగంలో అడుగుపెట్టి విజయం సాధిస్తోంది. ఆమెకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకీ రోజా ముద్దుబిడ్డ అన్షు మల్లికా ఏం రగంలో అడుగుపెట్టిందో తెలుసా? ‘సాహిత్యం’. ఈ కాలం పిల్లలు అంతా ఆధునిక ఐటీ, ఫ్యాషన్, సహా ఇన్నోవేషన్ రంగాల్లో ముందుకెళుతుంటే.. రోజా కూతురు మాత్రం సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించి భాషపై పట్టు సాధించి సృజనాత్మకతతో ముందుకెళుతోంది. ఆమె ప్రతిభకు ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.




Tags:    

Similar News