తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త జిల్లాలు

Update: 2016-08-22 09:50 GMT
తెలంగాణ జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. తొమ్మిది జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మార్గదర్శకాలకు జీవో 194ను ప్రభుత్వం విడుదల చేసింది. పునర్‌ వ్యవస్థీకరణపై నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. కలెక్టరేట్లు - సీసీఎల్‌ ఏలో అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. ముసాయిదా ఆర్డరును తెలంగాణ ప్రభుత్వ goir.telanga.gov.in వెబ్ సైట్లో ఉంచారు. ఈ నోటిఫికేషన్ ను సమాచార శాఖ పత్రికలకు ప్రకటన వెలువరిస్తుంది. జిల్లా స్థాయిలో మంగళవారంనుంచి కలెక్టర్ - జెడ్పీ - సబ్ కలెక్టర్ - ఆర్డీవో - ఎమ్మార్వో - ఎండీవో - గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నోటిఫికేషన్ ప్రదర్శిస్తారు.  రాష్ర్ట విభజన తరువాత ఏపీ - తెలంగాణల్లో కొత్త జిల్లాలు ఏర్పడనుండడం ఇదే ప్రథమం.

కొత్తగా 17 జిల్లాలు ఏర్పటవుతున్నాయి. దీంతో మొత్తం జిల్లాలు 27 కానున్నాయి. 31 మండలాలు - 14  రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పటవుతున్నాయి. దీంతో 58 రెవెన్యూ డివిజన్లవుతాయి. 9 జిల్లాలకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చారు. అన్నీ పూర్తయ్యాక దసరా నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని చెబుతున్నారు.  కాగా ప్రస్తుతం రాష్ట్రంలో పది జిల్లాలు - 44 రెవెన్యూ డివిజన్లు - 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు - 58 రెవెన్యూ డివిజన్లు - 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలనా ఊపందుకోనుంది.

కాగా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల కాగానే కొత్త జిల్లాల్లో పెద్దఎత్తున సంబరాలు మొదలయ్యాయి. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి మాదిరిగా పలు చోట్ల ప్రజలు - టీఆరెస్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి సంతోషాన్ని వ్యక్తంచేస్తున్నారు.
Tags:    

Similar News