అరెరే.. టీజీగారూ.. అప్పుడేం చేశారండీ!

Update: 2019-09-14 01:30 GMT
రాజధాని విషయంలో రాయలసీమకు చాలా అన్యాయం జరిగిందని వాపోతున్నారు టీజీ వెంకటేష్. ఈయన ఇప్పుడు బీజేపీ ఎంపీగా చలామణి అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన టీజీ వెంకటేష్ ఇప్పుడు బీజేపీలోకి విలీనం అయ్యారు! ఆ పార్టీ ఎంపీ అయ్యారు!

ఈ క్రమంలో రాయలసీమ మీద ఎనలేని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఈయన. అమరావతిని రాజధానిగా ప్రకటించి.. రాయలసీమకు చంద్రబాబు నాయుడు అన్యాయం చేశారని టీజీ అంటున్నారు. రాజధానిని రాయలసీమ ప్రాంతంలో ప్రకటించాల్సి ఉందన్నారు.

మరి ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజధానిని అమరావతి ప్రాంతంలో ప్రకటిస్తున్నప్పుడు టీజీ ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడి పక్కనే కదా!

టీడీపీ ఎంపీగా అప్పట్లో ఈయన చంద్రబాబు పనులకు వత్తాసు పలికే వారు. అప్పుడు ఈయనకు రాయలసీమ గుర్తుకు రాలేదు. ఇప్పుడు టీడీపీని వీడి బీజేపీలోకి చేరాకా.. మాత్రం ఇప్పుడు రాయలసీమ, రాజధాని అంటూ మాట్లాడుతూ ఉన్నారు. తాము ఏం మాట్లాడినా జనాలు చెవుల్లో పూలు పెట్టుకుని వింటూ ఉంటారని ఈ నేతలు భ్రమల్లో ఉంటారేమో!


Tags:    

Similar News