వీడియో : మళ్లీ అక్కడకు వెళ్లే రోజు కోసం అనసూయ వెయిటింగ్‌

Update: 2021-06-29 04:30 GMT
జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా తన ఫొటోలను మరియు వీడియోలను ఫీలింగ్స్ ను షేర్‌ చేస్తూ ఉంటుంది. రెగ్యులర్ గా హాట్‌ ఫొటో షూట్‌ లను షేర్‌ చేస్తూ ఉండే హాట్‌ యాంకర్‌ అనసూయ తాజాగా షేర్‌ చేసిన థ్రూ బ్యాక్ వీడియో అందరిని ఆకట్టుకుంటుంది. కొన్ని నెలల క్రితం కేరళకు అనసూయ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ తాను స్టే చేసిన ప్రదేశం అంటూ ఈ వీడియోను షేర్‌ చేసింది. కేరళ అందాలను మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చిన అనసూయ మళ్లీ అక్కడకు వెళ్లే రోజు కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ వీడియోకు కామెంట్‌ పెట్టింది.

అనసూయ ఒక వైపు జబర్దస్త్‌ యాంకర్‌ గా చేస్తూ మరో వైపు వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ఐటెం సాంగ్‌ లను ప్రత్యేక పాత్రలను హీరోయిన్‌ పాత్రలు ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తున్న అనసూయ త్వరలో పుష్ప సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుకుమార్‌ దర్శకత్వం లో వచ్చిన రంగస్థలం సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న అనసూయ మళ్లీ ఆయన దర్శకత్వంలో చేస్తున్న పుష్ప ఖచ్చితంగా ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చి పెడుతుందని అంటున్నారు.

సోషల్‌ మీడియాలో ఎంతగా విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా తనకు కంఫర్ట్‌ అనిపించిన కాస్ట్యూమ్స్ లో ఫిల్మ్‌ మేకర్స్ కోరినట్లుగా నటించేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండే అనసూయ కు హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అనడం లో సందేహం లేదు. ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా అనసూయ జోరు చూసి హీరోయిన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ కొడుకులు పెరిగి పెద్ద వారు అయినా కూడా ఆమె ఇండస్ట్రీలో ఇదే జోరుతో కొనసాగే అవకాశం ఉందేమో చూడాలి.

Full View
Tags:    

Similar News