సీఎం కొడుక్కి బంగారు గొలుసు ఇచ్చిన నిర్మాత!

Update: 2022-07-13 04:30 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు అయిన ఉదయనిధి స్టాలిన్ హీరోగా తాన్య రవిచంద్రన్‌.. శివానీ రాజశేఖర్‌ హీరోయిన్స్ గా నటించిన నెంజుక్కు నీది సినిమా విడుదల అయ్యి 50 రోజులు పూర్తి చేసుకుంది.

సినిమా కు ఊహించిన దాని కంటే అధికంగా వసూళ్లు నమోదు అవ్వడం తో పాటు.. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుని కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో చిత్ర యూనిట్‌ సభ్యులు 50 రోజుల వేడుక వైభవంగా నిర్వహించారు.

ఈ సినిమా ను జీ స్టూడియోస్.. బేవ్యూ ప్రొజెక్ట్‌.. రోమియో పిక్చర్స్ వారితో కలిసి బోనీ కపూర్‌ నిర్మించాడు. సినిమా సక్సెస్ నేపథ్యంలో బోనీ కపూర్‌ చిత్ర యూనిట్‌ సభ్యులకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు 50 రోజుల షీల్డ్‌ లను అందించి ప్రతి ఒక్కరిని అభినందించాడు. ఈ స్పెషల్‌ డే సందర్బంగా ఒక బంగారు గొలుసును ఉదయనిధి స్టాలిన్ కు బోనీ కపూర్ బహుమానంగా ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా బోనీ కపూర్‌ మాట్లాడుతూ.. నెంజుక్కు నీది సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. తమిళంలో వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే నాలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తాం అన్నాడు.

ఆయన ఇంకా మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ తో కలిసి మళ్లీ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఆయన మళ్లీ డేట్లు ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాను అన్నాడు. ఆయన సినీ మరియు రాజకీయ జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా బోనీ కపూర్‌ పేర్కొన్నాడు.

ఇదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం సక్సెస్‌ వెనుక దర్శకుడి కష్టం ఉంది. నటీ నటులు మరియు ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా ఎంతో కష్టపడ్డారు. సినిమా ను ఆధరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సొంత బ్యానర్ లో అరుణ్ రాజా కామరాజ్ తో కలిసి నటించాను. మళ్లీ ఆ అవకాశం బోనీ కపూర్‌ గారి వల్ల దక్కింనది ఉదయనిధి స్టాలిన్ అన్నాడు.
Tags:    

Similar News