స్వాతిముత్యం అనుకున్నట్లుగానే అక్కడ తెగ ఆడేస్తోంది

Update: 2022-10-29 12:30 GMT
బెల్లంకొండ సాయి గణేష్‌ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా రూపొంది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్వాతిముత్యం సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దసరా సందర్భంగా చిరంజీవి మరియు నాగార్జున సినిమాలతో పోటీ పడ్డ స్వాతిముత్యం కలెక్షన్స్ ను రాబట్టడంలో విఫలం అయ్యింది.

సినిమాకు పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్నా కూడా కలెక్షన్స్ రాకపోవడంతో వెంటనే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేశారు. ఓటీటీ లో ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. సినిమా స్ట్రీమింగ్ అయ్యిన కొన్ని గంటల్లోనే భారీ ఎత్తున వ్యూ మినిట్స్ నమోదు అయినట్లుగా ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించారు.

ఈ ఏడాదిలో వచ్చిన ఒక మంచి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ స్వాతిముత్యం ను ఆహా తెగ సోషల్‌ మీడియాలో ప్రమోట్ చేసింది. దాంతో ఏకంగా 50 మిలియన్ ల వ్యూ మినిట్స్ ఈ సినిమాకు ఆహా లో నమోదు అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

స్వాతిముత్యం సినిమా సరోగసి విధానం చుట్టు తిరుగుతూ ఉంటుంది. మంచి ఎంటర్‌ టైనర్ గా విభిన్నమైన స్క్రీన్‌ ప్లే తో సినిమాను తెరకెక్కించడం జరిగింది. హీరో హీరోయిన్ మధ్య ఉండే సన్నివేశాలు మరియు కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచే విధంగా ఉన్నాయి.

ఓటీటీ ద్వారా ఈ సినిమాకు వస్తున్న స్పందన చూస్తూ ఉంటే.. దసరా సమయంలో కాకుండా పోటీ లేని సమయంలో స్వాతిముత్యం ను థియేటర్‌ ల ద్వారా రిలీజ్ చేసి ఉంటే తప్పకుండా భారీ ఎత్తున వసూళ్లు నమోదు చేసి ఉండేది అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News