పెళ్లైన మహిళతో పొందు కోసం ప్రియదర్శి తిప్పలు

Update: 2021-04-30 00:30 GMT
డిఫరెంట్ కంటెంట్ లేకపోతే ఓటీటిలలో వర్కవుట్ కావటంలేదు. ముఖ్యంగా మన తెలుగువాళ్లు చూసే వెబ్ సీరిస్ లు గమనిస్తే ఈ విషయం అర్దమవుతుంది. క్రైమ్ లేదా శృంగారం వీటికే ప్రయారిటీ ఇస్తున్నారు. డైరక్ట్ గానో లేక అండర్ కరెంట్ గానో ఈ కంటెంట్ అంతర్లీనంగా ప్రవహిస్తూనే ఉండాలి. ఇదిగో ఇప్పుడు ప్రియదర్శితో చేస్తున్న వెబ్ సీరిస్ కూడా అలాంటిదే.

తెలుగులో వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న కమిడియన్ ప్రియదర్శి. లూజర్ వెబ్ సీరిస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన మరోసారి ఓటీటి ప్లాట్ ఫామ్ లో కనపడబోతున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అనే టైటిల్ తో ఆహాలో ఓ వెబ్ సీరిస్ చేసారు. మే 21 నుంచి ఈ వెబ్ సీరిస్ ప్రీమియర్ కానుంది. ఇందులో పోసాని కృష్ణమురళి కూడా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.

నందినీరాయ్ పాత్ర ఓ పెళ్లైన మహిళ. ఆమె తన భర్తని చంపేస్తుంది. అందుకు ప్రియదర్శి సాయిం చేస్తాడు. చంపబడ్డ భర్త శవం మాయం చేయటానికి జీప్ ని డ్రైవ్ చేయటానికి ఒప్పుకుంటాడు. అతని కోరిక ఏమిటంటే..ఆమెతో పడుకోవటం. అయితే అనుకున్నది అనుకున్నట్లు జరగదు. మధ్యలో రకరకాల సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో ప్రియదర్శి పడే తిప్పలు సీరియస్ గా ఉన్నా నవ్విస్తాయంటున్నారు. చాలా కొత్తగా కనిపించే ఈ వెబ్ సీరిస్ పై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇక జాతిరత్నాలు సూపర్ హిట్టయ్యాక ప్రియదర్శి క్రేజ్ రెట్టింపు అయ్యింది.
Tags:    

Similar News