చిట్టి ఫ‌రియా స్ట‌న్నింగ్ లుక్ వైర‌ల్

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ఫ‌రియా ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. వీటిలో ఫ‌రియా డ్యాన్సింగ్ ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి.

Update: 2023-12-22 08:21 GMT

ఆర‌డుగుల బుల్లెట్టు మ‌న చిట్టి ఫ‌రియా. ఎత్తుకు త‌గ్గ సొగ‌సు, మేని విరుపులు త‌న‌లో దాచుకుని యూత్ గుండెలు కొల్ల‌గొట్టింది. న‌టిగా తొలి చిత్రంతోనే త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకుంది. ఏజెంట్ ఆత్రేయ‌లో ఫ‌రియా న‌ట‌న‌కు యువ‌త‌రం మంత్ర‌ముగ్ధులైపోయారు. తాజాగా సోష‌ల్ మీడియాలో ఫ‌రియా కొత్త లుక్ రిలీజ్ కాగా, అది ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.


న‌టించిన తొలి చిత్రంతోనే త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో మెప్పించిన‌ ఫ‌రియా అబ్ధుల్లా.. 'జాతి రత్నాలు'లో చిట్టి పాత్రతో హృదయాలను గెలుచుకుంది. ఆర‌డ‌గుల ఈ అందం పొడుగుకాళ్ల సుంద‌రిగానూ కుర్రాళ్ల మ‌న‌సులు దోచింది. తాజాగా జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తనకు డ్యాన్స్ పై ఉన్న ప్రేమ గురించి చెప్పింది. చిట్టి ఫ‌రియా అంద‌చందాల‌కు ఫిదా అయిపోయింది యువ‌లోకం.


ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో ఫ‌రియా ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్నాయి. వీటిలో ఫ‌రియా డ్యాన్సింగ్ ప్రాక్టీస్ కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఫ‌రియాకు డ్యాన్స్ పై ఉన్న ప్రేమ మ‌మ‌కారం అంతా ఇంతా కాదు. డ్యాన్సుల కోసం అద‌నంగా శ్ర‌మిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలు ఇంతకుముందు వైర‌ల్ అయ్యాయి. సంగీతంపైనా ఫ‌రియా ఎంతో ఆస‌క్తిగా ఉంటుంది. ఫ‌రియా ఫన్ టీజింగ్ వీడియోలు కూడా ఇప్ప‌టికే యువ‌త‌రంలోకి దూసుకెళ్లాయి.


ఫ‌రియా తెలివైన ఎంపిక‌ల‌తో కెరీర్ ని సాగించాల‌ని ప్లాన్ చేస్తోంది. ప్ర‌స్తుతం త‌న డ్యాన్సింగ్ యాక్టింగ్ స్కిల్స్ కి మ‌రింత ప‌దును పెడుతూ వ‌రుస‌గా క‌థ‌లు వింటోంద‌ని స‌మాచారం. ఫరియా అబ్దుల్లా చివరిసారిగా 'ది జెంగాబురు కర్స్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. తప్పిపోయిన తన తండ్రి కోసం అన్వేషణలో లండన్‌కు చెందిన విశ్లేషకురాలు ప్రియా దాస్ ప్ర‌య‌త్నాలేమిట‌న్న‌ది ఈ సిరీస్ లో చూపించారు. ప్రియాదాస్ పాత్రను ఫ‌రియా పోషించింది. ఈ సిరీస్ లో అద్బుత‌ నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. నటుడు తిరువీర్ సరసన పేరులేని ప్రాజెక్ట్‌లో ఫారియా నటించబోతున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. ఈ చిత్రంతో గోపి జి దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఏషియన్ సినిమాస్ నిర్మిస్తోంది. ఈ సంవత్సరం దసరా రోజు ప్రకటన వెలువడింది.


ఫరియా అబ్దుల్లా 2021లో తెలుగు హిట్ జాతి రత్నాలు చిత్రంతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. అనుదీప్ కెవి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో కలిసి నటించారు. స్వప్న ఫిల్మ్స్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జాతిర‌త్నాలు 6 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెర‌కెక్కి బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో అతిథి పాత్ర‌లో మెరిసిన ఫ‌రియా త‌దుప‌రి మంచు విష్ణు సినిమాలోనూ న‌టిస్తోందని క‌థ‌నాలొచ్చాయి. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఇది రూపొంద‌నుంది. ఢీ సీక్వెల్ కావొచ్చ‌ని ప్ర‌చార‌మైంది. కానీ ఇటీవ‌ల ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఏదీ రాలేదు.

Tags:    

Similar News