ఆ స్టార్ హీరో కూడా రెండు భాగాలుగా!

కంటెంట్ ని బ‌ట్టి సినిమాని రెండు భాగాలుగా చేయ‌డం.. సీక్వెల్స్ గా తెర‌పైకి తీసుకురావ‌డం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే

Update: 2024-01-18 16:30 GMT

కంటెంట్ ని బ‌ట్టి సినిమాని రెండు భాగాలుగా చేయ‌డం.. సీక్వెల్స్ గా తెర‌పైకి తీసుకురావ‌డం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. అందులోనూ పాన్ ఇండియాలో క్రేజ్ సంపాదించుకున్న హీరోలంతా ఒక్క సినిమానే రెండు భాగాలు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. స్టోరీ డిమాండ్ ని బ‌ట్టి రెండు భాగాలుగా విడ‌దీసి రెండు సార్లు బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో ఊపేయ‌డం ప‌రిపాటిగా మారింది. 'బాహుబ‌లి'..'కేజీఎఫ్' లాంటి సినిమాలు ఈ విధానానికి ప్ర‌ధానంగా తెర తీసాయి.


ప్ర‌స్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న 'దేవ‌ర' రెండు భాగాలుగా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే 'కేజీఎఫ్ -3' కూడా ఉంటుంద‌ని ఇప్ప‌టికే రివీల్ చేసారు. ఇంకా 'స‌లార్ -2' ఉండ‌నే ఉంది. 'ఓజీ' కూడా రెండు భాగాలుగా తీస్తున్నట్లు ఇప్ప‌టికే ప్ర‌చారంలో ఉంది. తాజాగా మ‌రో సినిమా కూడా రెండు భాగాల జాబి తాలో చేరింది. మాలీవుడ్ స్టార్ మోహ‌న్ లాల్ క‌థానాయ‌కుడిగా 'మ‌లైకోటై వాలిబ‌న్' అనే పీరియాడిక్ చిత్రం తెర‌కెక్కుతోంది.

లిజో జోస్ పెలీసెరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాకి భారీ హైప్ తీసుకొచ్చాయి. మోహ‌న్ లాల్ లుక్.. ఆహార్యం ప్రతీది అభిమానుల‌కు కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ని అందిం చింది. అలాగే మ్యూజికల్ గానూ మంచి హిట్ అయింది. ఈనెల 25న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారుట‌.

ఈ క‌థ‌కి కొన‌సాగింపుగా మ‌రో చిత్రం తెర‌కెక్కించ‌డానికి అవ‌కాశం ఉండ‌టంతో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. భ‌విష్య‌త్ త‌రాల కోసం ఒక వ్య‌క్తి చేసిన పోరాటాల‌ను ఇందులో చూపించ ననున్నారు. త్వ‌ర‌లోనే సీక్వెల్ కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రిలీజ్ కానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌? అన్న‌ది మేక‌ర్స్ ధృవీక‌రించాల్సి ఉంది.

Tags:    

Similar News