నా సామి రంగా: ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా..

ముగ్గురు బాల్య స్నేహితుల కథతో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు.

Update: 2023-12-07 18:47 GMT

కింగ్ నాగార్జున నటిస్తున్న `నాసామి రంగ` సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముగ్గురు బాల్య స్నేహితుల కథతో పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పుడు `నా సామి రంగా` నుండి మొదటి పాట ప్రోమోను విడుదల చేసారు.


నా సామి రంగాలోని మొదటి పాట `ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా` ప్రోమో విడుద‌లైంది. ఈ పాట‌లో కింగ్ నాగార్జున ఎన‌ర్జీ.. య‌శిక అంద‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ యువ‌త‌రం హృద‌యాల‌ను ఆక‌ట్టుకున్నాయి. ఈ పాట గ్రామీణ నేపథ్యంలో ఎంతో ప్లెజెంట్ గా క‌నిపిస్తోంది. ఇందులో ప్రధాన జంట నాగార్జున- ఆషికా రంగనాథ్ గ్రామస్తులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న సంద‌ర్భ‌మ‌ది. జంట అందంగా క‌నిపించారు. ఇరువురి న‌డుమా కెమిస్ట్రీ.. కొరియోగ్ర‌ఫీ సంవిధానం ఆక‌ట్టుకున్నాయి. అయితే ఇది కేవలం ప్రోమో మాత్రమే. మిరియాల స్వ‌య‌రం పాట ఆక‌ట్టుకోగా, విజువల్‌గా మేకింగ్ మ‌రింత రంజింప‌జేసింది. డిసెంబర్ 10న లిరికల్ వీడియో లాంచ్ కానుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్ లో శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున - ఆషిక రంగనాథ్ నాయకానాయిక‌లు. అనన్య నాగళ్ల, అవికా గోర్ ఇత‌ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్ కీరవాణి. నా సామి రంగ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది మహేష్ బాబు గుంటూరు కారం - రవితేజ డేగతో బాక్సాఫీస్ వద్ద ఢీకొంటుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 7 నాటికి షూటింగ్ పూర్తి చేస్తార‌ని తెలుస్తోంది.

Full View
Tags:    

Similar News