బిగ్ బాస్ 8 : ఆ ముగ్గురు ఒకటి.. మిగతా వాళ్లంతా ఒకటి..?

ఇక మరోపక్క 3వ వారం నైనిక, యష్మిలను చీఫ్ లుగా తీసేసి అభయ్ ని చీఫ్ గా ఎంపిక చేశారు.

Update: 2024-09-25 06:19 GMT

బిగ్ బాస్ లో గ్రూప్ గేమ్ అనేది చాలా కామన్. ఈసారి బిగ్ బాస్ స్వయంగా క్లాన్ ఏర్పరచి చీఫ్ లుగా ఒకరిని ఉంచి ఆటలు ఆడిస్తున్నాడు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి వారం నుంచి నిఖిల్ చీఫ్ గా కొనసాగుతున్నాడు. ఫస్ట్ వీక్ ముగ్గురు చీఫ్ లు ఉన్నారు. వారిలో నైనిక, యష్మి ఉన్నారు. రెండో వారం కూడా వారే చీఫ్ లుగా కొనసాగారు. ఇక మరోపక్క 3వ వారం నైనిక, యష్మిలను చీఫ్ లుగా తీసేసి అభయ్ ని చీఫ్ గా ఎంపిక చేశారు.

ఆదివారం అభయ్ ఎలిమినేట్ అవ్వగా శక్తి టీం కి నిఖిల్ చీఫ్ గా ఉన్నా కాంతారా టీం కు చీఫ్ లేకుండా అయిపోయింది. అందుకే మంగళవారం కొత్త చీఫ్ ఎంపిక జరిగింది. సీత కొత్త చీఫ్ గా సెలెక్ట్ అయ్యింది. ఐతే నిఖిల్ ఆల్రెడీ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి నిఖిల్, సీతలను హౌస్ మెట్స్ అందరిలో క్లాన్ ఎంపిక చేసుకోమని అన్నారు. కంటెస్టెంట్స్ ఎవరి వారి ఇష్టాలను బట్టి ఎవరి చీఫ్ కి వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు.

ఐతే నేడు జరగనున్న ఎపిసోడ్ ప్రోమో లేటెస్ట్ గా రిలీజైంది. ఈ ప్రోమోలో నిఖిల్ క్లాన్ లోకి పృధ్వి, సోనియా వెళ్లగా సీత క్లాన్ లోకి విష్ణు ప్రియ, నైనిక వెళ్లారు. నబీల్ కూడా నిఖిల్ క్లాన్ కు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అంటూ సీత క్లాన్ లోకి వెళ్లాడు. ఐతే యష్మి కూడా సీత క్లాన్ లోకి వెళ్లాలని అనుకుంది. కానీ ప్రేరణ ఒక్క నిమిషం బిగ్ బాస్ అని మధ్యలో ఆపేసింది.

ప్రోమోలో ప్రేరణ యష్మిని సీత క్లాన్ లో ఉండకూడదు అనుకుందా ఇంకా ప్రేరణ, ఆదిత్య ఓం, మణికంఠ ఎవరి క్లాన్ లోకి వెళ్లారు. ఈ క్లాన్ ల మధ్య ఈ వారం ఫైట్ ఎలా ఉండబోతుంది లాంటి విషయాలు ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది. కొత్త చీఫ్ గా సీత కచ్చితంగా నిఖిల్ క్లాన్ కు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. నిఖిల్, సోనియా, పృధ్వి ఈ ముగ్గురు మీద ఆల్రెడీ హౌస్ మెట్స్ అంతా వ్యతిరేకంగా ఉన్న టైం లో నిఖిల్ క్లాన్ లో మళ్లీ వాళ్లే రావడం మిగతా కంటెస్టెంట్స్ అంతా సీత క్లాన్ కి వెళ్లడం వారితో డైరెక్ట్ ఫైట్ కి సిద్ధం అన్నట్టుగా ఉంది.

Full View
Tags:    

Similar News