'సలార్' ఏపీ టికెట్ హైక్స్.. బాద్యతే వాళ్ళదే..

UV క్రియేషన్స్ నిర్మాతలు ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. అందుకే సలార్ ఏపీ టికెట్ హైక్స్ కోసం UV క్రియేషన్స్ నిర్మాతలను సలార్ మేకర్స్ రంగంలోకి దింపుతున్నారట.

Update: 2023-12-15 15:03 GMT

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ ప్లాన్ ఇండియా మూవీ 'సలార్' డిసెంబర్ 22న విడుదలకు ముస్తాబవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరోవైపు చిత్ర నిర్మాతలు సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.

ఇప్పటికే తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు, అదనపు షోలు వేసుకునేందుకు పర్మిషన్ కోసం మైత్రి మూవీ మేకర్స్ ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టింది. సలార్ నైజాం హక్కులను మైత్రి నిర్మాతలు భారీ ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం మైత్రి రిక్వెస్ట్ ను పరిగణలోకి తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక అదే సమయంలో సలార్ నిర్మాతలైన హోం బలే ఫిలిమ్స్ వారు ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వానికి అప్లై చేశారు. అయితే ఈ విషయంలో హోం బలే నిర్మాతలు UV క్రియేషన్స్ సహాయం కోరినట్లు తెలుస్తోంది. UV క్రియేషన్స్ నిర్మాతలు ప్రభాస్ కి బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. అందుకే సలార్ ఏపీ టికెట్ హైక్స్ కోసం UV క్రియేషన్స్ నిర్మాతలను సలార్ మేకర్స్ రంగంలోకి దింపుతున్నారట.

దీంతో వాళ్ళు ప్రభుత్వంతో ఫాలోఅప్ చేస్తారట. మరోవైపు ఇదే UV క్రియేషన్స్ సపోర్ట్ తో యాత్ర2 మూవీని నిర్మిస్తున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్ పొలిటికల్ లైఫ్ ఆధారంగానే యాత్ర 2వ్తెరకెక్కుతోంది. కాబట్టి ఆ రూట్లో UV క్రియేషన్స్ ఏపీ ప్రభుత్వంతో మాట్లాడితే సలార్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మరి UV క్రియేషన్స్ ఎంట్రీ తో సలార్ కి బెనిఫిట్ అందుతుందో లేదో చూడాలి. మరోవైపు సలార్ రిలీజ్ కి మరో వారం రోజులు సమయం మాత్రమే ఉంది.

అయినా కూడా ఇప్పటివరకు మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. చివరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా లేదు. కాకపోతే రాజమౌళితో టీం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ని ప్లాన్ చేసినట్లు తెలిసింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ లతో రాజమౌళి ఇంటర్వ్యూ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ దీనిపై కూడా మూవీ టీమ్ నుంచి అధికారిక సమాచారం లేదు. సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా కనిపించనున్నారు. ఈశ్వరి రావు, బాబీ సింహ, శ్రియ రెడ్డి, సప్తగిరి, టీనూ ఆనంద్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Tags:    

Similar News