వరుణ్ తేజ్ చేస్తున్నది బయోపిక్కా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Update: 2024-09-15 04:25 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో ‘మట్కా’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ SRT ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడికల్ జోనర్ లో పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 1958 నుంచి 1982 మధ్యలో జరిగిన కథగా ‘మట్కా’ మూవీ ఉండబోతోంది.

ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ మూడు వేరియేషన్స్ లో ఉంటుంది. ఒక సాధారణ గ్యాంబ్లర్ నుంచి ‘మట్కా’ కింగ్ గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే వరకు అతని ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారంట. ‘మట్కా’ అంటే జూదంలో ఒక రకమైన ఆట. ఇందులో చాలా తక్కువ మందికి టాలెంట్ ఉంటుంది. ఒకప్పుడు ఈ జూదం కోసం ప్రత్యేకంగా క్లబ్ లని నడిపేవారు. ఇప్పుడు అవి గోవాలాంటి ప్రాంతాలకి పరిమితం అయిపోయాయి.

ఇక వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ విశాఖలో దొండపర్తి ప్రాంతంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన మట్కా కింగ్ బయోపిక్ తో చేస్తున్నాడనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఒరిజినల్ క్యారెక్టర్ ని తీసుకొని దానికి కరుణ కుమార్ తనదైన ఫిక్షనల్ స్క్రీన్ ప్లే జోడించి పాన్ ఇండియా కథగా ఈ చిత్రాన్ని చెప్పబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో దొండపర్తి ప్రాంతంలోనే కరుణ కుమార్ కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.

కరుణ కుమార్ ఉత్తరాంధ్ర నేపథ్యం, అక్కడి కల్చర్ మీద మంచి పట్టుంది. అతని మొదటి సినిమా పలాస శ్రీకాకుళం నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పుడు మట్కా సినిమా కథని విశాఖ బ్యాక్ డ్రాప్ లో చెప్పబోతున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కన్నడ కిషోర్. మైమ్ గోపి కీలక పాత్రలు చేస్తున్నారు.

జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. 2025లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఇప్పటికే మట్కా మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, హీరో ఫస్ట్ లుక్ మంచి ఇంప్రెషన్స్ క్రియేట్ చేశాయి. కచ్చితంగా వరుణ్ తేజ్ కెరియర్ లో ‘మట్కా’ స్పెషల్ మూవీ అవుతుందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News