యూట్యూబ్ లో వీడియోలు చూస్తూ ముక్కలుగా నరికేశాడు

బెంగళూరులోని ఒక మహిళను ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచి ఉంచితన దుర్మార్గం గురించి తెలిసిందే.

Update: 2024-10-06 04:27 GMT

బెంగళూరులోని ఒక మహిళను ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచి ఉంచితన దుర్మార్గం గురించి తెలిసిందే. అత్యంత పాశవికంగా చేసినోడు కొద్దిరోజులకే తన సొంతూరులోచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవటం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు తాజాగా పలు విషయాలను గుర్తించారు. బెంగళూరులో వయ్యాలికావల్ లో బ్యూటీషియన్ గా పని చేస్తున్న 29ఏళ్ల మహలక్ష్మిని సెప్టెంబరు రెండున ముక్తిరంజన్ దాస్ హత్య చేశాడు. అనంతరం ఆమె శవాన్ని బయటకు తరలించటం కష్టమన్న విషయాన్ని గుర్తించిన అతను అత్యంత దారుణంగా వ్యవహరించాడు.

యూట్యూబ్ లో పలు వీడియోలు చూస్తూ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా ఎలా చేయాలో తెలుసుకున్నాడు. అనంతరం కూరగాయల మాదిరి ఫ్రిజ్ లో పేరుస్తూ.. రక్తాన్నియాసిడ్ తో కడిగేశాడు. రక్తంఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. హత్య చేసిన తర్వాతి రోజు ఉదయమే హెబ్బగోడిలో తన సోదరుడి వద్దకు వెళ్లి.. జరిగిన విషయాలన్ని చెప్పేయటంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచన చేశాడు.

దీంతో.. తన బైక్ మీదనే 1600కిలోమీటర్లు రైడ్ చేసుకుంటూ సొంతూరికి వెళ్లిపోయాడు. తాను చేసిన తప్పుడు పని గురించి తల్లికి చెప్పాడు. మహలక్ష్మి హత్యకు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని చాలా రోజులు వెయిట్ చేసి చూశాడు. అతను అనుకున్నట్లే సెప్టెంబరు మూడో వారంలో కానీ మహలక్ష్మి హత్యకు సంబంధించిన విషయం వెలుగు చూసింది.ఆ తర్వాత అతను భయపడటం మొదలు పెట్టాడు. తన కోసం ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో పోలీసులు వెతుకున్న విషయాన్ని గుర్తించాడు.

తన కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు తనను అదుపులోకి తీసుకోవటం ఖాయమని నమ్మిన అతడు.. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు సొంతూరు లోని ఒక చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ కు ముందు డెత్ నోట్ రాసిన అతను తనువు చాలించాడు. ఇంతకు మహలక్ష్మిని ఎందుకు చంపాల్సి వచ్చింది? అక్కడి వరకు విషయం ఎందుకు వెళ్లింది? అన్న కోణంలో పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం.. మహలక్ష్మిని ప్రేమిస్తున్న అతను ఒకరోజు అనుమానంతో ఆమె సెల్ ఫోన్ ను చూస్తే.. ఆమెకు పెళ్లైందని.. కొడుకు ఉన్నట్లుగా గుర్తించాడు. వారిద్దరిని వదిలేసి ఒంటరిగా ఉంటుందని తెలుసుకొని ఆమెతో గొడవ పడ్డాడు.

అప్పటి నుంచి ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాడు. మరో యువతితో అతను స్నేహాన్ని పెంచుకున్నాడు. ఆమెతో మహలక్ష్మి గొడవ పడింది. తన భర్తకు విడాకులు ఇస్తానని.. తనను పెళ్లి చేసుకోవాలని గొడవ పడింది. అప్పటికి ఆమెకు దూరంగా ఉంటే.. తనను అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు ఇస్తానని బెదిరింపులకు దిగటంతో ఆమె మద తీవ్రమైన కోపాన్ని పెంచుకున్నాడు. ఈ కోపంతోనే ఆమెపై దాడి చేయగా.. స్ప్రహ కోల్పోయింది. అనంతరం దిండు ముఖానికి అదిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News