ఎన్నికల ముంగిట జనసేనకు బిగ్ షాక్.. అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాక్!

దీంతో ఈ విషయం ఆ పార్టీకి బిగ్ షాక్ అని అంటున్నారు.;

Update: 2024-04-14 03:43 GMT

జనసేనకు ఎన్నికల ముంగిట ఊహించని దెబ్బ తగిలిందనే చెప్పాలి. సరిగ్గా పోలింగ్ కు ఇంకా నెలరోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో.. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో... పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయం ఆ పార్టీకి బిగ్ షాక్ అని అంటున్నారు.

అవును.. సరిగ్గా ఇంకా నెల రోజుల్లో 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి! ఈ సమయంలో ఏపీలో అధికార వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిగా కదనరంగలోకి అడుగుపెడుతున్నాయి. ఈ కీలక సమయంలో... జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయ్యిందనే విషయం వైరల్ గా మారింది.

జనసేన అధికార యూట్యూబ్ ఛానల్ కి సుమారు 1.4 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ఉండగా.. ఐదున్నర వేల వీడియోలు ఉండేవి! పార్టీ కార్యక్రమాలు, పవన్ ప్రసంగాలు, వారాహి యాత్రలను అందులో లైవ్ టెలీకాస్ట్ చేసేవారు. ఆ ఛానల్ ని హ్యాక్ చేసిన హ్యాకర్లు.. దాని పేరును మైక్రోస్ట్రాటజీగా మార్చేశారు. ప్రస్తుతం ఆ హ్యాక్ చేయబడిన ఛానల్ లో యూట్యూబ్ బ్యాన్ చేసిన బిట్ కాయిన్ గురించిన కొన్ని లైవ్ వీడియోలు కూడా ప్రారంభించారు!

దీంతో... ఈ విషయం యూట్యూబ్ దృష్టికి వస్తే చానల్ ని పూర్తిగా బ్యాన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు! అయితే ఈలోపు జనసేన పార్టీకి చెందిన టెక్నికల్ టీం.. యూట్యూబ్ సంస్థ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తే ఛానల్ ని మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది!

Tags:    

Similar News