కొడుకును అడుక్కోవడం ఏంటి సామి... కోటీశ్వరుడైన ఓ ఎమ్మెల్యే మాటలు వైరల్

రాజకీయాల్లో అప్పుడప్పుడు ఫన్నీ సన్నివేశాలు చోటుచేసుకుంటుంటాయి.

Update: 2024-09-06 09:12 GMT

రాజకీయాల్లో అప్పుడప్పుడు ఫన్నీ సన్నివేశాలు చోటుచేసుకుంటుంటాయి. రాజకీయాలు అంటేనే ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. సరిగా అలాంటి సన్నివేశమే ఈ రోజు ఓ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య చోటుచేసుకుంది.


రాజకీయాల్లో వారసత్వాన్ని అందిపుచ్చుకొని చాలా మంది నేతలు ఎదుగుతుంటారు. ఒకే ఫ్యామిలీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా రాజకీయాల్లో కనిపిస్తుంటారు. అలా రాజకీయాల్లో ఎదుగుతున్న కొడుకులను చూసి తండ్రులు సైతం ఎంతో ఉప్పొంగిపోతుంటారు. అయితే.. తండ్రి ఎమ్మెల్యేగా ఉండి.. కొడుకు ఎంపీ అయి.. స్వయంగా కొడుకునే తన నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కోరితే ఎలా ఉంటుంది.

ఇదే సీన్ రిపీట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. చెన్నూర్ నియోజకవర్గం నుంచి గడ్డం వివేక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన తనయుడు గడ్డం వంశీ ఎంపీగా గెలుపొందారు. అయితే.. చెన్నూరు నియోజకవర్గం కూడా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

వీరిద్దరూ కలిసి ఓ కార్యక్రమం పాల్గొన్నారు. అక్కడ ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వివేక్ మాట్లాడుతూ.. ‘ఎంపీ ల్యాడ్స్ నిధులు చెన్నూరు ప్రాంతానికే ఇవ్వాలని కోరాడు. ఇతర నియోజకవర్గాలకు ఎక్కువ ఇవ్వొద్దని అన్నాడు. మిమ్మల్ని అడగడానికి నాకు ఆ హక్కు ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.

తండ్రి అయి ఉండి చివరకు కొడుకును పైసలు అడుక్కునే పరిస్థితి వచ్చిందే అని చమత్కరించారు. ‘కోటీశ్వరుడైన నువ్వు కొడుకును పైసలు అడగాల్సిన పరిస్థితి వచ్చిందే’ అంటూ సరదా కామెంట్స్ వినిపించాయి.

Tags:    

Similar News