స్విగ్గీలో ఒక్క ఆర్డర్ కూడా రాని రోజేదో తెలుసా?

ప్రస్తుతం ఇంట్లో కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేసుకుంటుంటే.. డోర్ ముందుకు పార్శిల్ ప్రత్యక్షమవుతోంది.

Update: 2024-08-28 09:05 GMT

ప్రస్తుతం ఇంట్లో కూర్చుని ఫుడ్ ఆర్డర్ చేసుకుంటుంటే.. డోర్ ముందుకు పార్శిల్ ప్రత్యక్షమవుతోంది. ఈ విధంగా యాప్ లో ఆర్డర్ పెట్టడం ఆలస్యం.. వీలైనంత వేగంగా ఫుడ్ డెలివరీ చేసే యాప్స్ లో స్విగ్గీ ఒకటనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ స్విగ్గీ ప్రారంభమై పదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా.. స్విగ్గీ సీఈవో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

అవును... 2014లో బెంగళూరు కేంద్రంగా స్విగ్గీ ప్రారంభమైంది. శ్రీహర్ష మాజేటి, రాహుల్, నందన్ రెడ్డి భాగస్వామ్యంలో ఈ ఫుడ్ డెలివరీ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ క్రమంలో సుమారు 600 భారత నగరాల్లో స్విగ్గీ కార్యకలాపాలు విస్తరించాయి. ఈ సమయంలో... తొలిరోజు వ్యాపారం ప్రారంభించినప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు శ్రీహర్ష.

స్విగ్గీ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా స్పందించిన ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మాజేటి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పె ట్టారు. ఈ సందర్భంగా తమ తొలి రోజు వ్యాపార అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగా.. 2014 ఆగస్టు 6న స్విగ్గీని ప్రారంభించినట్లు తెలిపారు.

ఆ సమయంలో ఫుడ్ ఆర్డర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసినట్లు తెలిపిన ఆయన.. మొదటి రోజు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని.. మరుసటి రోజే తమ తొలి ఆర్డర్ ను అందుకున్నట్లు చెప్పరు. అదే తమ జర్నీకి అసలైన ప్రారంభం అని వెల్లడించారు. తమ తొలి పార్ట్నర్స్ లో ఒకరైన ట్రపుల్స్ రెస్టారెంట్ నుంచి ఆ రోజు రెండు ఆర్డర్స్ వచ్చాయని వెల్లడించారు.

నాటి నుంచి వారితో తమ భాగస్వామ్యం అలానే కొనసాగుతుందని, అది మరింత బలపడిందని తెలిపారు. ఒక దశలో ఒక్క రోజులోనే 7,261 ఆర్డర్లు అందుకున్నట్లు శ్రీహర్ష వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం మూడు లక్షల రెస్టారంట్లతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తమపై విశ్వాసం ఉంచిన రెస్టారంట్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News