జూన్ లో ఆర్థిక మాంద్యం ఖాయం.. కేంద్ర ప్రభుత్వం దాస్తోందా?

Update: 2023-01-18 02:30 GMT
దేశాన్ని ఆర్థిక మాంద్యం కమ్మేస్తోందా? కేంద్రం దాస్తోందా? అంటే ఔననే అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి ఒకరు ఈ విషయాన్ని బాంబు పేల్చారు. కేంద్ర సూక్ష్మ, చిన్న -మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మంత్రి నారాయణ్ రాణే సోమవారం చేసిన ప్రకటన సంచలనమైంది. దేశంలో మాంద్యం మబ్బులు కమ్ముకుంటున్నాయని.. అధ్వాన్నమైన ఆర్థిక స్థితి ఉందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

తన ప్రకటనలతో తరచూ వివాదాస్పదం అయ్యే ఈ మంత్రి, కేంద్ర బడ్జెట్‌కు కేంద్రం సిద్ధంగా ఉన్న సమయంలో ఇలా అనడంతో సంచలనమైంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం ధోరణిని భారతదేశం అధిగమించిందని ప్రభుత్వం నొక్కిచెబుతుంటే ప్రభుత్వంలోని ఈ మంత్రి ఇలా వ్యాఖ్యానించడం సంచలనమైంది. జీ20కి సంబంధించిన కార్యక్రమంలో ప్రారంభ ప్రసంగం చేసిన తర్వాత రాణే మాట్లాడుతూ  మోడీ ప్రభుత్వం భారతదేశానికి వచ్చిన వార్షిక జీ20 ప్రెసిడెన్సీని షోపీస్ ఈవెంట్‌గా జరుపుకుంటోందని..ప్రపంచ మాంద్యం ఉంది.. ఇది చాలా దేశాలలో ఉంది. కేంద్ర ప్రభుత్వ సమావేశాలలో జరిగిన చర్చల నుండి నేను సేకరించినది ఇదే. జూన్ తర్వాత మాంద్యం భారతదేశాన్ని తాకుతుందని అంచనా వేయబడింది ”అని పూణేలో జరిగిన జీ20 ఈవెంట్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, దాని ప్రభావాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాణే సంచలన కామెంట్స్ చేశారు.

మంగళవారం దీనిపై కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు: “2014 నుండి నాశనం చేయబడిన ఎంఎస్ఎంఈ ల యొక్క కేంద్ర క్యాబినెట్ మంత్రి నారాయణ్ రాణే  6 నెలల తర్వాత భారతదేశంలో మాంద్యం గురించి అంచనా వేశారు. పుణెలో జరిగిన జీ20 సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు. పీఎం & ఎఫ్ఎం దేశం నుండి ఏమి దాచారు?’ అని ప్రశ్నించారు.

ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా రాణే చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయని సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు. మంగళవారం సమావేశంలో పార్టీ ఆమోదించిన సామాజిక-ఆర్థిక తీర్మానం భారతదేశం "ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ" గా ఎదుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్ ఆందోళనలు కలిగి ఉందని వెల్లడించడం ద్వారా, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాణే ప్రతిపక్షానికి ప్రధాన ఆయుధాన్ని ఇచ్చారు" అని బిజెపి నాయకుడు అన్నారు.

రాణే యొక్క మాంద్యం వ్యాఖ్యలు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో ఆందోళనకు గురిచేశాయి. యూరప్ మరియు చైనాలను పీడిస్తున్న సమస్యల వల్ల ఇప్పుడు తిరోగమనం కాకుండా భారత్ లాభపడవచ్చని అంటున్నారు.. బీజేపీలోని రాణే సహోద్యోగులు ఆయనపై మండిపడుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో అల్లకల్లోలానికి దారితీస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News