ఊరు ఖాళీ: నిర్వాసితుల నెత్తిన ‘మల్లన్నసాగర్’

Update: 2021-08-17 14:30 GMT
మెదక్ జిల్లాలోని కొమురవెల్లి మలన్న సాగర్ ప్రాజెక్ట్ రెడీ అయ్యింది. దాని కింద ముంపు గ్రామాలను ఇప్పుడు రాత్రికి రాత్రి ఖాళీ చేయించే పనిలో అధికారులు పడ్డారు. ప్రాజెక్ట్ కింద ఉన్న ముంపు గ్రామం రాంపురం మదిర వడ్డెర కాలనీ వాసులను సోమవారం రాత్రికి రాత్రే అధికారులు ఖాళీ చేయించారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఈ కాలనీలో సుమారు 75 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అందులో మెజార్టీ కుటుంబాలు ఇప్పటికే గ్రామం నుంచి వెళ్లిపోగా.. సోమవారం రాత్రి 30 డీసీఎంలు తీసుకొని తహసీల్దార్ బాల్ రెడ్డి, ఆర్ రవీందర్ కాలనీకి వచ్చారు.

ఈ క్రమంలోనే అధికారులను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం పూర్తిస్థాయిలో చెల్లించకుండా ఎలా ఖాళీ చేయిస్తారంటూ  నిర్వాసితులు అధికారులతో గొడవకు దిగారు. అర్ధరాత్రి తాము ఎక్కడికి వెళ్లేదంటూ మహిళలు, పురుషులు బోరున విలపించారు. అర్హులైన వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందంటూ వారికి నచ్చ జెప్పారు. రెండు మూడు రోజుల్లో రిజర్వాయర్ లోకి నీరు వదిలేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు వారికి వివరించారు.

ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు వడ్డెర కాలనీలోని సుమారు 30 కుటుంబాలను అధికారులు ఖాళీ చేయించారు.
Tags:    

Similar News