కుంభమేళాలో కరోనా కలకలం .. ప్రధాని మోదీ స్పందన ఇదే

Update: 2021-04-17 11:30 GMT
దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. ఈ సమయంలో కరోనా ను కట్టడి చేయలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో ఒక పక్క ఎన్నికలు.. మరోపక్క పండగలు.. ప్రజలు ఎక్కువగా గుమిగూడేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.  తాజాగా హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళా కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువు అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా జనం ఒకేదగ్గర చేరడం. కరోనా నిబంధనలు అందరూ పాటించే అవకాశం లేకపోవడంతో ఇక్కడ కరోనా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నారు. దీనిని కట్టడి చేయడం కోసం కుంభమేళాను నిలిపివేయాలని పలువురు విన్నపం చేస్తున్నారు. ఈ కుంభమేళా నిర్వహణపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయంపై తన స్పందన తెలియజేశారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి అదుపులేకుండా వ్యాపిస్తున్నందున కుంభమేళాను పరిమితంగా నిర్వహించుకోవాలని , కుంభమేళాలో పాల్గొన్న సాధువుల్లో చాలా మందికి కరోనా సోకినా విషయం తెలిసిందే. దీనితో, ప్రధాని మోడీ జునా అఖడాహెడ్ స్వామి అవధేశానంద్ గిరితో ఫోనులో మాట్లాడారు. ఈ విషయాన్ని మోడీ స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. సాధువుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్న ప్రధాని వారికి ప్రభుత్వం అన్నిరకాల వైద్యసేవలనూ అందిస్తుందని తెలిపారు.  రెండు షాహీ స్నాన్ ‌(రాజ స్నానాలు) పూర్తయ్యాయి కనుక ఇప్పుడున్న కరోనా సంకట పరిస్థితుల్లో కుంభమేళాను ప్రతీకాత్మకంగా (భక్తులెవరూ లేకుండా ) జరపాలని స్వామి అవధేశానంద్‌ గిరిని ప్రార్థించాను. ఈ నిర్ణయం మహమ్మారిపై పోరాటానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది అని మోదీ ట్వీటర్‌ లో తెలిపారు.

ఏప్రిల్‌ 12, 14 రోజుల్లో జరిగిన షాహీ స్నాన్‌లలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అయితే దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో కుంభమేళాను కొనసాగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కుంభమేళాలో పాల్గొన్న అనేక మంది భక్తులతో పాటు పలు అఖాడాలకు చెందిన సాధువులు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో కొన్ని అఖాడాలు స్వచ్ఛందంగా హరిద్వార్‌ను వీడేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలాఉంటే.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుంభమేళా ముగిసిందని నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై మరో ఇతర అఖాడాలకు చెందిన సాధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా ముగింపుపై ప్రకటన చేసే హక్కు ఏ ఒక్కరికీ లేదని, అది ముఖ్యమంత్రి మాత్రమే చేయాలని నిర్వాణి అఖాడా అధ్యక్షుడు మహంత్ ధర్మదాస్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Tags:    

Similar News