హైదరాబాద్ ప్రముఖుడి ఇంట్లో వజ్రాభరణాల చోరీ

Update: 2019-08-27 09:51 GMT
హైదరాబాద్ మహానగరంలో భారీ చోరీ చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో ఇంత భారీ ఇదేనని చెబుతున్నారు. సంపన్నులు నివసించే బంజారాహిల్స్ లో చోటు చేసుకున్న ఈ భారీ చోరీ ఇప్పుడు సంచలనంగా మారింది.

సినీ.. రాజకీయ ప్రముఖుడు టి. సుబ్బిరామిరెడ్డి అన్న కుమారుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో చోటు చేసుకున్న ఈ దొంగతనంలో విలువైన వజ్రాభరణాలు పోయినట్లుగా చెబుతున్నారు. చోరీ అయిన మొత్తం రూ.3 కోట్ల మేర ఉంటుందని అంచనా.

చోరీకి గురైన వాటిల్లో వజ్రాలు.. బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా దొంగలించారు. దొంగ ఎవరు?  చోరీ ఎలా జరిగింది?  అన్న వివరాలు బయటకు రాలేదు. బంజారాహిల్స్ పోలీసులకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసి.. విచారణను షురూ చేశారు.   


Tags:    

Similar News